మౌలిక వసతుల‌ కల్పనకు కృషి చేస్తా – మై హోమ్ విహంగ అపార్ట్మెంట్ అసోసియేషన్ ‌ఆత్మీయ సమావేశంలో ప్రభుత్వ విప్ గాంధీ

నమస్తే శేరిలింగంపల్లి: ప్రజలకు అవసరమైన మౌలిక వసతుల ‌కల్పనకు శాయశక్తులా కృషి‌ చేస్తామని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ ‌చెప్పారు. గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని మై హోమ్ విహంగ అపార్ట్మెంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఆత్మీయ సమావేశంలో ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ పాల్గొన్నారు. అపార్ట్మెంట్ వాసుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్బంగా ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ తన దృష్టికి వచ్చిన ప్రతి సమస్యను పరిష్కరిస్తానని అన్నారు.

గచ్చిబౌలి డివిజన్ లోని మై హోం విహంగ అపార్ట్మెంట్ కాలనీ వాసుల సమస్యలను తెలుసుకుంటున్న ప్రభుత్వ విప్ గాంధీ

పార్క్ ను అభివృద్ధి చేయాలని, ఫుట్ ఫాత్ ఏర్పాటు చేయాలని, చెత్త వేసిన డంపింగ్ యార్డ్ తొలగించాలని, రోడ్లు వీధి దీపాలు, ఎలక్ట్రికల్ సంబందిత సమస్యలను పరిష్కరించాలని ఎమ్మెల్యే ‌దృష్టికి‌ తీసుకువచ్చారు. సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే గాంధీ ప్రతీ సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ రవీందర్ ముదిరాజ్, మాదాపూర్ డివిజన్ అధ్యక్షుడు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, నాయకులు మంత్రి ప్రగడ సత్యనారాయణ, సురేందర్, మై హోమ్ విహంగ ప్రెసిడెంట్ మూర్తి, సెక్రటరీ కళ్యాణ్ రెడ్డి, జలగం సుదర్శన్ రావు, నారాయణ, కిరణ్, అపార్ట్మెంట్ వాసులు, తదితరులు పాల్గొన్నారు‌.

ఆత్మీయ సమావేశంలో మాట్లాడుతున్న ప్రభుత్వ విప్ గాంధీ
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here