నమస్తే శేరిలింగంపల్లి: పేద ప్రజల కోసం ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కాంగ్రెస్ శేరిలింగంపల్లి నియోజకవర్గం సీనియర్ నాయకులు జెరిపాటి జైపాల్ అన్నారు. చందానగర్ డివిజన్ పరిధిలోని శివాజీ నగర్ లో శేరిలింగంపల్లి కాంగ్రెస్ కమిటీ సభ్యులు, జెజె టీమ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని జెరిపాటి జైపాల్ ప్రారంభించారు. కో ఆర్డినేటర్ రఘునందన్ రెడ్డి, సీనియర్ నాయకులు ఇలియాస్ షరీఫ్, సురేష్ నాయక్, జావిద్ హుస్సేన్, ఈశ్వర్, సయీద్, పోచయ్య, రాజేందర్, ముత్యం రెడ్డి, ఖమ్మర్, అల్లావుద్దీన్ పటేల్, హరికిషన్, ఆయాజ్ ఖాన్, జహంగీర్, అజీముద్దిన్, మక్బుల్, ఖాజా పాషా, యువజన నాయకులు సౌందర్య రాజన్, రాజేశ్ గౌడ్, ప్రదీప్, ఖాజా, సలీం, ఆప్రోజ్ తదితరులు పాల్గొన్నారు.
![](https://namastheslp.com/wp-content/uploads/2022/07/IMG-20220703-WA0015.jpg)