శేరిలింగంపల్లి, ఏప్రిల్ 23 (నమస్తే శేరిలింగంపల్లి): కొండాపూర్ డివిజన్ పరిధిలోని గచ్చిబౌలిలో ప్రభుత్వ ప్రైమరీ & హై స్కూల్ ఆవరణలో సీఎస్ఆర్ నిధుల ద్వారా, 2 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో నూతన పాఠశాల భవన నిర్మాణం కొరకు జీహెచ్ఏంసీ జోనల్ కమిషనర్ ఉపేందర్ రెడ్డి, పిఏసీ చైర్మన్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ, కొండాపూర్ డివిజన్ కార్పొరేటర్ హమీద్ పటేల్ స్థానిక నాయకులతో కలసి శంకుస్థాపన చేశారు. ఈ శంకుస్థాపన కార్యక్రమంలో ఎమ్మెల్యే గాంధీ, కార్పొరేటర్ హమీద్ పటేల్, జోనల్ కమిషనర్ ఉపేందర్ రెడ్డి, కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్, సీనియర్ నాయకులు ఎర్రగుండ్ల శ్రీనివాస్ యాదవ్, నీరుడి గణేష్ ముదిరాజ్, శ్రీనివాస్ చౌదరి, మంగళరాపు తిరుపతి పటేల్, నరసింహ సాగర్, బసవరాజు, లక్ష్మి బాయి, బుడుగు తిరుపతి రెడ్డి, తిరుపతి యాదవ్, స్వామి సాగర్, వెంకటి, షణ్ముఖ్, అధికారులు, స్కూల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.