- శేరిలింగంపల్లి డివిజన్ కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్
శేరిలింగంపల్లి (నమస్తే శేరిలింగంపల్లి): కేంద్ర ప్రభుత్వం ఇటీవల అమలులోకి తెచ్చిన నూతన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ ఈ నెల 8వ తేదీన దేశవ్యాప్తంగా రైతులు నిర్వహించ తలపెట్టిన భారత్ బంద్కు అందరూ సహకరించాలని శేరిలింగంపల్లి డివిజన్ కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ కోరారు. భారత్ బంద్లో తెరాస శ్రేణులు పాల్గొనాలని పిలుపునిచ్చారు. మోదీ పార్లమెంట్లో ప్రవేశపెట్టిన వ్యవసాయ చట్టాలను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ నెల 8వ తేదీన ప్రజలందరూ భారత్ బంద్లో స్వచ్ఛందంగా పాల్గొనాలని పిలుపునిచ్చారు.