సమాన ప‌నికి స‌మాన వేత‌నం అందించాలి: తుడుం అనిల్ కుమార్

శేరిలింగంప‌ల్లి, మే 21 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): బహుజన , వామ పక్ష కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో 4 లేబర్ కార్డులను రద్దు చేయాల‌ని, అసంఘటిత, సంఘటిత కార్మికులకు కనీస వేతనాలు, సమాన పనికి సమాన వేతనం, అసంఘటిత కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలనే డిమాండ్లతో తెలంగాణ రాష్ట్ర కార్మిక శాఖ కార్యాలయం ఎదుట ఎ.ఐ.సి.టి.యు ఆధ్వ‌ర్యంలో ధ‌ర్నా నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా కమిషనర్ కి వినతి పత్రాన్ని అంద‌జేశారు. అనంత‌రం ఎ.ఐ.సి.టి.యు రాష్ట్ర అధ్యక్షుడు తుడుం అనిల్ కుమార్ మాట్లాడుతూ భారత బహుజన కార్మిక వర్గానికి రాజ్యాంగం కల్పించిన 44 రక్షణ చట్టాలను రద్దు చేసి కార్మిక వ్యతిరేక యాజమాన్య అనుకూల నాలుగు కోడ్ ల ను తెచ్చిన బిజెపి కేంద్ర ప్రభుత్వం అంబానీ, ఆదాని లాంటి స్వదేశీ, విదేశీ కార్పోరేట్ కంపెనీలకు లాభాల కోసం తెచ్చిన కార్మిక వ్యతిరేక 4 కోడ్ లను రద్దు చేయాలని అన్నారు. పబ్లిక్ రంగ సంస్థల ప్రైవేటీకరణను ఆపాలని, కనీస వేతనాలు, ఉద్యోగ భద్రత, కనీస కార్మిక చట్టాలు అమలు చేయాల‌ని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంస్థల్లోని ఔట్ సోర్సింగ్, కాంట్రాక్టు కార్మికులను పర్మినెంట్ చేయాలని ఆలోపు సుప్రీంకోర్టు తీర్పుననుసరించి కనీస వేతనం రూ.26 వేలు అమలు చేయాలని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో కర్ర దానయ్య, జి.శివాని, ఎం రాజు, నరసింహ, యాదగిరి, కె.చంద్రశేఖర్, ప్రసాద్, మల్లేష్, యాకయ్య, పి.యాదగిరి, జంగయ్య, గ్యార సాలయ్య, యస్,ప్రభాకర్, యం.వెంకటయ్య, డోలక్ యాదగిరి, షేక్ షావ‌లి, సునీత, మేకల రాజేందర్, గంగా శంకర్, బి.జగదీష్, యస్డీ స‌య్యద్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here