శేరిలింగంపల్లి, జూన్ 19 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి నియోజకవర్గ ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటానని, వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని నాయకుడు మారబోయిన రవి యాదవ్ అన్నారు. నియోజకవర్గం పరిధిలోని పలు ప్రాంతాలకు చెందిన ప్రజల సమస్యలను ఆయన అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ప్రజా సంక్షేమం కోసం కృషి చేస్తానని తెలిపారు. ప్రజలు ఎలాంటి సమస్య అయినా తన దృష్టికి తీసుకువస్తే పరిష్కరించేందుకు కృషి చేస్తానన్నారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను అధికారులు, నాయకుల వద్దకు తీసుకెళ్లి పరిష్కరించేందుకు సహాయ సహకారాలు అందిస్తానని అన్నారు.