శేరిలింగంపల్లి, జూలై 7 (నమస్తే శేరిలింగంపల్లి): హఫీజ్పేట్ డివిజన్ పరిధిలోని మైత్రి నగర్ ఫేజ్ 2 కాలనీ రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కు నూతనంగా ఎన్నుకోబడిన కాలనీ అసోసియేషన్ నూతన కార్యవర్గ సభ్యులు PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నూతన కార్యవర్గ సభ్యులను PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ అభినందించారు. అనంతరం PAC ఛైర్మన్ ఆరెకపూడి గాంధీ మాట్లాడుతూ మైత్రి నగర్ ఫేస్ 2 కాలనీ రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ వాసులు కాలనీ అభివృద్ధికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని అన్నారు. కాలనీలో అన్ని రకాల మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తానని, కాలనీ అభివృద్ధికి తన వంతు సహాయ సహకారాలు ఎల్లవేళలా ఉంటాయి అని అన్నారు. ఏ చిన్న సమస్య అయినా తన దృష్టికి తీసుకువస్తే వెంటనే పరిష్కరిస్తానని తెలిపారు. నూతనంగా ఎన్నుకోబడిన కార్యవర్గ సభ్యులు కాలనీ వాసులందరికి ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ కాలనీ సమస్యలపై స్పందిస్తూ , ప్రతి ఒక్కరు సమిష్టిగా కలిసి కాలనీ అభివృద్ధికి పాటుపడాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో మైత్రి నగర్ ఫేస్ 2 కాలనీ రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ చీఫ్ అడ్వైజర్లు చెన్నరెడ్డి, సుబ్రహ్మణేశ్వర్ రావు, విజయ్ భాస్కర్ రెడ్డి, వీరేందర్ చౌదరి, మురళి కృష్ణ, ప్రెసిడెంట్ శ్రీనివాసులు రెడ్డి, వైస్ ప్రెసిడెంట్లు సురేంద్ర బాబు, రఘుమోహన్, జనరల్ సెక్రటరీ ఈశ్వర్ కుమార్, జాయింట్ సెక్రటరీలు వెంకట పవన్ కుమార్, రాంకుమార్, ట్రెజరర్ ధీరజ్ కుమార్, ఆర్గనైజింగ్ సెక్రెటరీలు భాస్కర్ రెడ్డి, కళ్యాణ్ కుమార్, ఎక్జిక్యూటివ్ కమిటీ మెంబర్లు సంతోష్ కుమార్, రాజేష్ కుమార్, హనుమాన్ చౌదరి, నటరాజ కుమార్, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.