శేరిలింగంపల్లి, నవంబర్ 4 (నమస్తే శేరిలింగంపల్లి): మియాపూర్ డివిజన్ పరిధిలోని స్టాలిన్ నగర్ కాలనీలో TGSPDCL విద్యుత్ అధికారులు SE రవికుమార్, ADE హరికృష్ణ, సంబంధిత విద్యుత్ అధికారులతో కలిసి మియాపూర్ డివిజన్ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ కాలనీలో స్వయంగా పర్యటించి విద్యుత్ సమస్యలను పరిశీలించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ శ్రీకాంత్ మాట్లాడుతూ మియాపూర్ డివిజన్ పరిధిలోని మదీనాగూడ సబ్ స్టేషన్లో విద్యుత్ సమస్యలపై నిర్వహించిన విద్యుత్ వినియోగదారుల సదస్సులో స్వీకరించిన సమస్యల పరిష్కారం కోసం స్టాలిన్ నగర్ కాలనీలో విద్యుత్ అధికారులతో కలసి పర్యటించామని, విద్యుత్ సమస్యలను పరిశీలించడం జరిగిందని తెలిపారు. కాలనీలో విద్యుత్ సరఫరా, కొత్త లైన్ ల ఏర్పాటు, కొత్తగా ఏర్పాటు చేయాల్సిన ట్రాన్స్ఫార్మర్ల సంఖ్యను పెంచాలని, విరిగిన కరెంట్ స్తంభాలను మార్చాలని విద్యుత్ అధికారులకు తెలియజేయడం జరిగిందని కార్పొరేటర్ శ్రీకాంత్ తెలిపారు. ఈ కార్యక్రమంలో TGSPDCL సంబంధిత అధికారులు AE శ్రీనివాస్ రెడ్డి, లైన్ ఇన్స్పెక్టర్ రమేష్, లైన్మన్ పవన్, ఫోర్మన్ ప్రసాద్, సిబ్బంది, స్టాలిన్ నగర్ కాలనీ వాసులు రాణి, వెంకటేష్, శ్యామల, నరేష్, రాములు, వేణు, శ్రీను తదితరులు పాల్గొన్నారు.






