శేరిలింగంపల్లి, నవంబర్ 3 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లిలోని చందానగర్ సర్కిల్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ డి.శశిరేఖ, రెవెన్యూ విభాగం మని కరణ్,TPS రమేష్, AMOH Dr. K. S. రవి, Engineering section శ్రీదేవి, Entomology section R.చిన్నా, UBD section సమీర, Electrical section లక్ష్మి ప్రియా పాల్గొన్నారు. ఈ సందర్భంగా సర్కిల్ పరిధిలోని పలు ప్రాంతాలకు చెందిన వాసులు సంబంధిత అధికారులు, సిబ్బందికి తమ ఫిర్యాదులను అందజేశారు. టౌన్ ప్లానింగ్ లో 5, ఇంజినీరింగ్ లో 7, యూబీడీలో 1 మొత్తం కలిపి ప్రజావాణికి 13 ఫిర్యాదులు వచ్చాయని అధికారులు తెలిపారు. ఈ ఫిర్యాదులను వీలైనంత త్వరగా పరిష్కరించాలని సంబంధిత అధికారులు, సిబ్బందికి డీసీ శశిరేఖ ఆదేశాలు జారీ చేశారు.






