శేరిలింగంపల్లి, మార్చి 18 (నమస్తే శేరిలింగంపల్లి): మియాపూర్ డివిజన్ పరిధిలోని కోకనట్ గ్రో అపార్ట్మెంట్స్ వెల్ఫేర్ అసొసియేషన్ కు నూతనంగా ఎన్నుకోబడిన అసొసియేషన్ కార్యవర్గ సభ్యులు మియాపూర్ డివిజన్ కార్పోరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ ని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నుకోబడిన కార్యవర్గానికి ఆయన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ మాట్లాడుతూ.. కోకనట్ గ్రో అపార్ట్మెంట్స్ వెల్ఫేర్ అసొసియేషన్ కు నూతనంగా ఎన్నుకోబడిన అసోసియేషన్ సభ్యులను అభినందించడం జరిగిందని, అసొసియేషన్ అభివృద్ధికి కృషి చేస్తానని, ఏ చిన్న సమస్య ఉన్నా తన దృష్టికి తీసుకువస్తే వెంటనే పరిష్కరిస్తానని అన్నారు. అదేవిధంగా అపార్ట్మెంట్ లోని ప్రతి ఒక్కరి సమస్యల పై స్పందిస్తూ ప్రతి ఒక్కరు సమిష్టిగా కలిసి అభివృద్ధికి పాటుపడాలని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో కోకనట్ గ్రో అపార్ట్మెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు వివేకానంద రెడ్డి, గంగరాజు యాదవ్, శ్రీనివాస్ రెడ్డి, రాజాశేఖర్ రెడ్డి, మిథిలా, రవిశంకర్, రమేష్, ఫనిరామ్, పవన్, వంశి, పాండు తదితరులు పాల్గొన్నారు.