విద్యాశాఖ‌కు బ‌డ్జెట్‌లో 15 శాతం కేటాయించాలి: బేరి రామచంద్ర యాదవ్

శేరిలింగంపల్లి, మార్చి 18 (న‌మ‌స్తే శేరిలింగంపల్లి): తెలంగాణ రాష్ట్ర వార్షిక బడ్జెట్లో 15% విద్యా వ్యవస్థకు కేటాయించాలని బీసీ ఐక్యవేదిక అధ్యక్షుడు , బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీస్ J. A. C చైర్మన్ బేరి రామచంద్ర యాదవ్ కోరారు. జె. ఏ. సి. ఆధ్వర్యంలో జరిగిన రాష్ట్ర సదస్సులో పాల్గొన్న ఆయ‌న మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావటానికి అనేక వాగ్దానాలు చేసింద‌ని, అందులో ముఖ్యంగా విద్యా వ్యవస్థకు బడ్జెట్లో 15% కేటాయిస్తామని, బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇస్తామని అన్నార‌ని తెలిపారు.గ‌త బీఆర్ఎస్ ప్ర‌భుత్వం విద్యాశాఖ‌ను నిర్ల‌క్ష్యం చేసింద‌న్నారు. సీఎం రేవంత్ ప్ర‌భుత్వం పేద‌, మ‌ధ్య త‌ర‌గతి వ‌ర్గాల ఆర్థిక సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని విద్యావ్య‌వ‌స్థ‌కు బ‌డ్జెట్‌లో 15 శాతం కేటాయింపులు చేయాల‌ని అన్నారు.

ఈ కార్యక్రమంలో బీసీ ఫెడరేషన్ అధ్యక్షుడు ఆర్కే సాయన్న ముదిరాజ్, యూత్ అధ్యక్షులు కుమార్ యాదవ్, బాలల హక్కుల పరిరక్షణ వేదిక (CRPF) కార్య‌ద‌ర్శి ధనసిరి ప్రకాశ్, దళిత బహుజన ఫ్రంట్ (DBF), ఎం. వి. ఫౌండేషన్ (MVF), తల్లుల సంఘం (MOTHERS’ ASSOCIATION), నెట్‌వర్క్ ఫర్ ప్రొటెక్షన్ అఫ్ చైల్డ్ రైట్స్ (NPCR), ప్రజా ఉద్యమాల జాతీయ వేదిక (NAPM), సోషల్ డెమోక్రటిక్ ఫోరం (SDF), తెలంగాణ పీపుల్స్ జాయింట్ యాక్షన్ కమిటీ (TPJAC) నాయ‌కులు, ఎం.వి ఫౌండేషన్ జాతీయ కన్వీనర్ ఆర్ వెంకట్ రెడ్డి, డాక్టర్ ప్రసన్న హరికృష్ణ, ఎమ్మెల్సీ contesting పర్సన్ శంకర్, దళిత బహుజన్ ఫ్రంట్ కన్నెగంటి రవి పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here