CMC ఎనక్లేవ్ కాల‌నీ స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి కృషి: PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ

శేరిలింగంపల్లి, మార్చి 18 (న‌మ‌స్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని మసీదుబండలో ఉన్న CMC ఎనక్లేవ్ రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ వాసులు పలు సమస్యలు, చేపట్టవలసిన పలు అభివృద్ధి పనుల పై PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీని త‌న‌ నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి వినతిపత్రం సమర్పించారు. దీనిపై PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ సానుకూలంగా స్పందించారు. ఈ సందర్భంగా CMC ఎనక్లేవ్ రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ వాసులు మాట్లాడుతూ కాలనీ లో మౌలిక వసతులు కల్పించినందుకు కృతజ్ఞతలు తెలియచేస్తున్నాం అని అన్నారు. అదేవిధంగా కాలనీ లో అంపూర్తిగా మిగిలిపోయిన సీసీ రోడ్ల ను వేయాలని, అసంపూర్తిగా మిగిలిపోయిన UGD పనులు చేపట్టాలని, మంచి నీటి వ్యవస్థ ను మెరుగుపర‌చాలని, వీధి దీపాలను వ్యవస్థను ఏర్పాటు చేయాలని, వాటర్ ట్యాంకర్ల తో కాలనీ లో ఏర్పడిన ట్రాఫిక్ సమస్య ను పరిష్కరించాలని కోరారు.

ఈ సందర్భంగా PAC చైర్మన్ గాంధీ మాట్లాడుతూ త్వరలోనే కాలనీ లో పర్యటిస్తానని, CMC ఎనక్లేవ్ రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కాలనీ లో నెలకొన్న అసంపూర్తిగా మిగిలిపోయిన రోడ్ల సమస్యను త్వరితగతిన పరిష్కరిస్తామని అన్నారు. కాలనీ లో అన్ని రకాల మౌలిక వసతులు కలిపించామని, అసంపూర్తిగా మిగిలిపోయిన రోడ్లను, UGD పనులు అతి త్వరలో చేపట్టి ప్రజలకు అందుబాటులో కి తీసుకువస్తామని, అన్నారు. ఈ కార్యక్రమంలో CMC ఎనక్లేవ్ కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here