అన్ని ర‌కాల మౌలిక వ‌స‌తుల క‌ల్ప‌న‌కు కృషి: PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ

శేరిలింగంపల్లి, జూన్ 16 (న‌మ‌స్తే శేరిలింగంపల్లి): ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని ఇంద్రా నగర్, సాయి చరణ్ కాలనీల లో నెలకొన్న పలు సమస్యలు, చేపట్టవలసిన పలు అభివృద్ధిపనుల పై కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్, ఇంజనీరింగ్ విభాగం, జలమండలి అధికారులతో కలిసి PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ పాదయాత్ర చేశారు. ఈ సందర్భంగా ఇంద్రా నగర్, సాయి చరణ్ కాలనీల వాసులు మాట్లాడుతూ కాలనీల‌లో అసంపూర్తిగా మిగిలిపోయిన సీసీ రోడ్లు వేయాలని, డ్రైనేజి వ్యవస్థ ను, మంచి నీటి వ్యవస్థ ను మెరుగుపర‌చాలని కోరారు. ఈ సందర్భంగా PAC చైర్మన్ గాంధీ మాట్లాడుతూ కాలనీలలో నెలకొన్న అసంపూర్తిగా మిగిలిపోయిన రోడ్ల సమస్యను త్వరితగతిన పరిష్కరిస్తామని అన్నారు. త్వరలోనే సీసీ రోడ్డు ఏర్పాటు చేస్తామని, త్వరలోనే సీసీ రోడ్ల పనులకు శంకుస్థాపన చేస్తామ‌ని, కాలనీల‌లో అన్ని రకాల మౌలిక వసతులు క‌ల్పిస్తున్నామ‌ని అన్నారు. ఈ కార్యక్రమంలో GHMC ఇంజనీరింగ్ విభాగం అధికారులు AE శ్రావణి, వర్క్ ఇన్స్పెక్టర్ రవి కుమార్, జలమండలి వర్క్ ఇన్స్పెక్టర్ నాగరాజు, SRP సత్యనారాయణ, SRP నాయక్, నాయకులు, కార్యకర్తలు, మహిళలు, కాలనీల అసోసియేషన్ సభ్యులు, కాలనీల వాసులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here