శేరిలింగంపల్లి, మే 6 (నమస్తే శేరిలింగంపల్లి): చందానగర్ డివిజన్ పరిధిలోని జాతీయ రహదారి NH 65 ప్రధాన రహదారి పై BHEL చౌరస్తా లో రూ. 172.5 కోట్ల అంచనా వ్యయంతో 1.65 KM మేర పొడవు, 6 లైన్ల బ్రిడ్జి, 6 లైన్ల సర్వీస్ రోడ్డు తో కుడిన నూతనంగా నిర్మించిన ఫ్లై ఓవర్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో కేంద్ర మంత్రులు నితిన్ గడ్కరీ, కిషన్ రెడ్డి, రాష్ట్ర మంత్రులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, దామోదర్ రాజానర్సింహ, కొండా సురేఖ, ఎంపీలు కొండా విశ్వేశ్వరరెడ్డి రెడ్డి, రఘునందన్ రావు, ఎమ్మెల్సీ అంజి రెడ్డి, ఎమ్మెల్యే గూడెం మహిపాల్, MBC చైర్మన్ జేరిపేటి జైపాల్, కార్పొరేటర్లు మంజుల రఘునాథ్ రెడ్డి, రాగం నాగేందర్ యాదవ్, హమీద్ పటేల్, దొడ్ల వెంకటేష్ గౌడ్, ఉప్పలపాటి శ్రీకాంత్, గంగాధర్ రెడ్డితో కలిసి PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా PAC చైర్మన్ గాంధీ మాట్లాడుతూ ఫ్లై ఓవర్ ను త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాడం చాలా గొప్ప విషయం అని, ప్రజల సౌకర్యార్థం నిర్మిస్తున్న ఫ్లై ఓవర్ నిర్మాణం పనులను వేగవంతం చేసి, పనులలో జాప్యం లేకుండా త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులో కి తీసుకురావాడం జరిగిందని, ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని రకాల చర్యలు, జాగ్రత్తలు తీసుకోవడం జరిగిందని, ప్రజలకు ట్రాఫిక్ రహిత , సుఖవంతమైన ప్రయణానికి బాటలు వేయడం జరిగిందని, పరిసర ప్రాంత ప్రజలకు ఇక నుండి ట్రాఫిక్ సమస్య లేకుండా ప్రయాణం కొనసాగుతుందని తెలియచేసారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్లు, మాజీ కార్పొరేటర్లు, నాయకులు, కార్యకర్తలు, కాలనీల అసోసియేషన్ సభ్యులు, కాలనీ వాసులు , మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.