శేరిలింగంపల్లి, మే 6 (నమస్తే శేరిలింగంపల్లి): క్రీడాకారులు తమ ప్రతిభను చాటి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించాలని శేరిలింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ అన్నారు. తెల్లాపూర్ విలేజ్ గద్దర్ సర్కిల్ ప్రాంగణంలో అమృత సత్తయ్య కొల్లూరి ఎడ్యుకేషనల్ సొసైటీ, తెల్లాపూర్ మాజీ కౌన్సిలర్ కొల్లూరి భరత్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రస్థాయి ఓపెన్ టు ఆల్ కబడ్డీ వాలీబాల్ టోర్నమెంట్ ను (ASKES) ఆర్.సీ పురం కార్పొరేటర్ పుష్ప నాగేష్ యాదవ్, ఏసీపి గంగాధర్, సీనియర్ నాయకులు బద్దం కొండల్ రెడ్డి, పద్మారావు, ఐలేష్ యాదవ్, రమేష్ యాదవ్, పలువురు నాయకులతో కలిసి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ.. ఇలాంటి పోటీలను క్రీడాకారులు వేదికగా చేసుకుని అంతర్జాతీయ స్థాయిలో రాణించి దేశానికి పేరు తీసుకురావాలన్నారు. క్రీడాకారులను ప్రోత్సహించేందుకు ఇలాంటి పోటీలు నిర్వహించడం పట్ల నిర్వాహకులను అభినందించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర స్థాయి కబడ్డీ, వాలీబాల్ ప్లేయర్స్ స్థానిక ప్రజలు తదితరులు పాల్గొన్నారు.