శేరిలింగంపల్లి, మే 6 (నమస్తే శేరిలింగంపల్లి): జాతీయ రహదారి-65పై హైదరాబాద్ లో దాదాపు 130 కోట్ల రూపాయలతో 1.65 కిలోమీటర్ల పొడవు నిర్మించిన బీహెచ్ఈఎల్ ఫ్లైఓవర్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ, చేవెళ్ల పార్లమెంటు సభ్యుడు కొండా విశ్వేశ్వర్ రెడ్డి , మెదక్ పార్లమెంటు సభ్యుడు రఘునందన్ రావుతో కలిసి బీజేపీ శేరిలింగంపల్లి నియోజకవర్గ ఇంచార్జ్, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రవికుమార్ యాదవ్ పాల్గొన్నారు.