శేరిలింగంపల్లి, మే 9 (నమస్తే శేరిలింగంపల్లి): వివేకానంద నగర్ డివిజన్ పరిధిలోని వివేకానంద నగర్ కాలనీ అపార్ట్మెంట్స్ రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్ కు నూతనంగా ఎన్నుకోబడిన కాలనీ అసోసియేషన్ నూతన కార్యవర్గ సభ్యులు PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీని తన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నూతన కార్యవర్గ సభ్యులను PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ శాలువాతో సన్మానించి, అభినందించారు. ఈ సందర్భంగా PAC ఛైర్మన్ ఆరెకపూడి గాంధీ మాట్లాడుతూ వివేకానంద నగర్ కాలనీ అపార్ట్మెంట్స్ రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్ వాసులు కాలనీ అభివృద్ధికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని, కాలనీ లో అన్ని రకాల మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తానని, కాలనీ అభివృద్ధికి తన వంతు సహాయ సహకారాలు ఎల్లవేళలా ఉంటాయి అని అన్నారు.
ఈ కార్యక్రమంలో వివేకానంద నగర్ కాలనీ అపార్ట్మెంట్స్ రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు ప్రెసిడెంట్ S. వెంకట్రావు, వైస్ ప్రెసిడెంట్ SRKV ప్రసాద్, సెక్రెటరీ శ్రీనివాసరావు, జాయింట్ సెక్రటరీ కామరాజు, ట్రెజరర్ BSN మల్లేశ్వరరావు, మెంబర్లు నరేంద్ర బాబు, చక్రవర్తి, ప్రసాద్ రాజు, జగన్ మోహన్ రెడ్డి , అనిల్ కుమార్, పూర్ణచందర్ రావు, శ్రీను బాబు, స్వామి, రాధిక, సత్యవతి కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.