శేరిలింగంపల్లి, జూన్ 29 (నమస్తే శేరిలింగంపల్లి): కొండాపూర్ డివిజన్ పరిధిలోని మార్తాండ్ నగర్ కాలనీ కి చెందిన వడియరాజులు సొసైటీ సంఘంకు నూతనంగా ఎన్నుకోబడిన నూతన కార్యవర్గ సభ్యులు PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీని తన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నూతన కార్యవర్గ సభ్యులను PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ సన్మానించి అభినందించారు. ఈ సందర్భంగా PAC ఛైర్మన్ ఆరెకపూడి గాంధీ మాట్లాడుతూ వడియరాజులు సొసైటీ సంఘం సభ్యులు సంఘం అభివృద్ధికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని అన్నారు. వారు నివసిస్తున్న కాలనీలలో అన్ని రకాల మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తానని, కాలనీ, సంఘం అభివృద్ధికి తన వంతు సహాయ సహకారాలు ఎల్లవేళలా ఉంటాయి అని, ఏ చిన్న సమస్య అయినా తన దృష్టికి తీసుకువస్తే వెంటనే పరిష్కరిస్తానని అన్నారు. నూతనంగా ఎన్నుకోబడిన కార్యవర్గ సభ్యులు ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ సమస్యల పై స్పందిస్తూ ప్రతి ఒక్కరు సమిష్టిగా కలిసి సంఘం, కాలనీ అభివృద్ధికి పాటుపడాలని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకుడు సాంబయ్య, వడియరాజులు సొసైటీ సంఘం ప్రెసిడెంట్ దుర్గారావు, వైస్ ప్రెసిడెంట్ శ్రీనివాస్, సెక్రెటరీ కొండల్ రావు, జాయింట్ సెక్రటరీ మధు, ట్రెజరర్ శ్రీనివాసులు, ఎక్జిక్యూటివ్ మెంబర్లు బాలాజీ, వెంకటేశ్వరరావు, సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు.