డ్రీమ్ ఫర్ గుడ్ సొసైటీ సేవ‌లు అభినంద‌నీయం: కార్పొరేటర్ హమీద్ పటేల్

శేరిలింగంప‌ల్లి, అక్టోబ‌ర్ 4 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): డ్రీమ్ ఫర్ గుడ్ సొసైటీ ఆధ్వర్యంలో కొనుగోలు చేసిన నూతన స్కూల్ బస్సు ప్రారంభోత్సవ కార్యక్రమంలో కొండాపూర్ డివిజన్ కార్పొరేటర్ హమీద్ పటేల్ పాల్గొన్నారు. మాదాపూర్ డివిజన్, గోకుల్ ప్లాట్స్, వెంకటరమణ కాలనీలో ఉన్న‌ డ్రీమ్ ఫర్ గుడ్ సొసైటీ ఆధ్వర్యంలో, దాతల‌ సహాయ సహకారంతో, ప్రభుత్వ‌ పాఠశాల పేద విద్యార్థుల కోసం కొనుగోలు చేసిన నూతన స్కూల్ బస్సును కార్పొరేటర్ హమీద్ పటేల్ ముఖ్య అతిథిగా హాజ‌రై ప్రారంభించారు. ఈ సందర్బంగా కార్పొరేటర్ హమీద్ పటేల్ మాట్లాడుతూ సామాజిక బాధ్యతతో డ్రీమ్ ఫర్ గుడ్ సొసైటీ పేద పిల్లల‌ కోసం ఎంతో సేవ చేస్తుందని అన్నారు.

స్కూల్ బ‌స్సును ప్రారంభిస్తున్న కార్పొరేటర్ హమీద్ పటేల్

డ్రీమ్ ఫర్ గుడ్ సొసైటీ వ్యవస్థాపకురాలు సీహెచ్ అరుణ గత కొన్ని సంవత్సరాల నుండి పలు సేవా కార్యక్రమాలు చేస్తూ సామాజిక సృహతో, బాధ్యతతో ఎనలేని కృషి చేస్తున్నారని కొనియాడారు. ఈ సందర్బంగా డ్రీమ్ ఫర్ గుడ్ సొసైటీకు చెందిన పాఠశాల విద్యార్థులకు స్కూల్ బ్యాగులను ఉచితంగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ముమ్మలనేని రాజశేఖర్, మాజీ కార్పొరేటర్ అశోక్ గౌడ్, దేవేందర్ రెడ్డి, మాజీ కౌన్సిలర్ రామస్వామి యాదవ్, లయన్స్ క్లబ్ సురేష్, లయన్స్ దేవేందర్ రెడ్డి, ఉదయ్, డ్రీమ్ ఫర్ గుడ్ సొసైటీ సభ్యులు, గోకుల్ ప్లాట్స్ కాలనీవాసులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here