మౌలిక వసతుల కల్పనకు కృషి  – కార్పొరేటర్ హమీద్ పటేల్

నమస్తే శేరిలింగంపల్లి: కొండాపూర్ డివిజన్ పరిధిలో సఫారీ నగర్ కాలనీలోని అమ్మ వారి గుడి ప్రధాన రహదారి వద్ద చేపడుతున్న అంతర్గత మురుగు నీటి కాలువ పనుల తీరును జీహెచ్ఎంసి అధికారులు, స్థానిక నాయకులతో కలిసి కొండాపూర్ డివిజన్ కార్పొరేటర్ హమీద్ పటేల్ పర్యవేక్షించారు.

సఫారీ నగర్ కాలనీలోని పడుతున్న అంతర్గత మురుగునీటి కాలువ పని తీరును పరిశీలిస్తున్న హమీద్ పటేల్

స్థానికులు లేవనెత్తిన సమస్యలను పరిష్కరించే దిశగా పనులను చేపట్టాలని జీహెచ్ఎంసి అధికారులకు సూచించారు. అంతర్గత డ్రైనేజీ శాశ్వత పరిష్కారం దిశగా, రానున్న భవిష్యత్తులో సమస్యలు పునరావృత్తం కాకుండా, స్థానికుల అభిప్రాయం మేరకు పనులను జరగాలని ఆయన జీహెచ్ఎంసి అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో జీహెచ్ఎంసి ఇంజనీరింగ్ విభాగం ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శ్రీనివాస్, డిప్యూటీ ఇంజనీర్ రమేష్, కొండాపూర్ డివిజన్ తెరాస పార్టీ సెక్రటరీ జె. బలరాం యాదవ్, తెరాస నాయకులు అన్నం శశిధర్ రెడ్డి, జంగంగౌడ్, లక్ష్మణ్ గౌడ్, ఎమ్. మల్లేష్, మొహ్మద్ జాఫర్ పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here