శేరిలింగంపల్లి, మే 11 (నమస్తే శేరిలింగంపల్లి): మాదాపూర్ డివిజన్ పరిధిలోని లోని సిఆర్ ఫౌండేషన్ చండ్ర రాజేశ్వరరావు పాలీ క్లినిక్, రోటరీ ప్రోలిఫిక్స్ డయాగ్నస్టిక్ సెంటర్, జయంతి హాస్పిటల్స్, రోటరీ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ మావెరిక్స్ సంయుక్తంగా నిర్వహించిన ఉచిత వైద్య శిబిరాన్ని CR ఫౌండేషన్ ఛైర్మన్ డాక్టర్ కె. నారాయణ, జనరల్ సెక్రటరీ, మాజీ MLA పల్లా వెంకట్ రెడ్డి, కార్యదర్శి మాజీ MLC పి జే చంద్ర శేఖర్ రావు, కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ తో కలిసి PAC చైర్మన్ ఆరెక పూడి గాంధీ ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రారంభించారు.
ఈ సందర్భంగా PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ మాట్లాడుతూ ప్రజలు ఈ ఉచిత వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఇలాంటి శిబిరాలను నిర్వహించేందుకు దాతలు, స్వచ్ఛంద సంస్థలు, కార్పొరేట్ హాస్పిటల్స్ ముందుకు రావాలన్నారు. పేదలకు కార్పొరేట్ స్థాయి వైద్యం అందాలన్నదే తమ లక్ష్యమని అన్నారు. ఈ కార్యక్రమంలో CR పాలీ క్లినిక్ డైరెక్టర్ డాక్టర్ రజని, CR పాలీ క్లినిక్ సలహాదారు, ఛైర్మన్, IFCAI, డాక్టర్ బి. రంగారెడ్డి, COO విజయ లక్ష్మి, రోటరీ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ మావెరిక్స్ అధ్యక్షుడు డాక్టర్ టి. సురేష్ బాబు, డాక్టర్ శరత్ చంద్ర, సి ఆర్ ఫౌండేషన్ ఉపాధ్యక్షుడు కంభంపాటి అజయ్, హోమ్ ఫర్ ఏజ్డ్, NRR రీసెర్చ్ సెంటర్, మహిళా సేవా కేంద్రం సభ్యులు, కనెక్ట్ డయాగ్నోస్టిక్స్, MAA ENT హాస్పిటల్స్, హీలియోస్ నుండి వాలంటీర్లు సహా అనేక మంది ప్రముఖ వ్యక్తులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.