నమస్తే శేరిలింగంపల్లి: దీపావళి పండగను పురస్కరించుకుని ఎంపీ రంజిత్ రెడ్డి, ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీలకు ఎంపీ రంజిత్ రెడ్డి యూత్ అసోసియేషన్ అధ్యక్షుడు రామ్ కటకం, టీమ్ జీఆర్ఆర్ అధ్యక్షుడు జహీరుద్దీన్ లు దీపావళి పండగ శుభాకాంక్షలు తెలిపారు. శుక్రవారం ఎంపీ రంజిత్ రెడ్డిని ఆయన స్వగృహంలో రామ్ కటకం, జహీరుద్దీన్ మర్యాదపూర్వకంగా కలిశారు. పూల మొక్కను అందించి దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం చందానగర్ డివిజన్ టీఆర్ఎస్ అధ్యక్షుడు రఘునాథ్ రెడ్డితో కలిసి ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీని కలిసి దీపావళి పండగ శుభాకాంక్షలు తెలిపారు.
![](https://namastheslp.com/wp-content/uploads/2021/11/IMG-20211105-WA0006.jpg)
![](https://namastheslp.com/wp-content/uploads/2021/11/IMG-20211105-WA0005.jpg)