జనప్రియ నగర్ నగర్ ఫేస్ 1 లో ప్రభుత్వ విప్ గాంధీ పర్యటన

నమస్తే శేరిలింగంపల్లి:హఫీజ్ పెట్ డివిజన్ పరిధిలోని జనప్రియ నగర్ ఫేస్ 1 కాలనీలో నెలకొన్న సమస్యలు, చేపట్టవలసిన పలు అభివృద్ధి పనుల పై కాలనీలో ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ శుక్రవారం పర్యటించారు. కాలనీవాసుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కాయిదమ్మ కుంట చెరువు కట్ట కింద గల జనప్రియ ఫేస్ 1 కాలనీలో రోడ్డు ను పునరుద్ధరణ చేయాలని ప్రభుత్వ విప్ గాంధీ దృష్టి కి తీసుకువచ్చారు. ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ మాట్లాడుతూ రోడ్డు సమస్యను త్వరలోనే పరిష్కరిస్తామన్నారు. ప్రజలకు ఇబ్బంది లేకుండా మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తామన్నారు. చెరువు అలుగు నుండి నిర్మించిన వరద నీటి కాలువ నిర్మాణం వలన రోడ్డు సమస్య ఏర్పడిందని, త్వరలోనే రోడ్డు ను పునరుద్ధరణ చేస్తామన్నారు. కాలనీ వాసుల విజ్ఞప్తి మేరకు కాలనీలో పాదయాత్ర చేపట్టారు. డివిజన్ లో పెండింగ్ పనులను త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు ఇబ్బందులు లేకుండా కృషి చేస్తామని ప్రభుత్వ విప్ గాంధీ పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో జనప్రియ ఫేస్ 1 కాలనీ వాసులు శాంత య్య, మలికార్జున్, ఉమేష్, ఉమామహేశ్వరరావు, రాంచందర్, సురేష్, ఫణి కుమార్, ప్రకాష్ పటేల్, శివకుమార్, శ్రీనివాస్, శేఖరయ్య తదితరులు పాల్గొన్నారు.

జనప్రియ నగర్ నగర్ ఫేస్ 1 లో సమస్యలు అడిగి తెలుసుకుంటున్న ప్రభుత్వ విప్ గాంధీ
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here