శేరిలింగంపల్లి, ఏప్రిల్ 30 (నమస్తే శేరిలింగంపల్లి): శ్రీ మహాత్మా బసవేశ్వర 892 వ జయంతి సందర్భంగా హోప్ ఫౌండేషన్ ఛైర్మన్ కొండా విజయ్ ఆధ్వర్యంలో హఫీజ్పేట్ డివిజన్ పరిధిలోని హుడా కాలనీ లో నిర్వహించిన బసవేశ్వర జయంతి వేడుకలలో ఆయన చిత్రపటానికి నివాళులు అర్పించి , 200 మంది మహిళలకు కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్, సీనియర్ నాయకుడు రఘునాథ్ రెడ్డి తో కలిసి PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ చీరలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా PAC చైర్మన్ గాంధీ మాట్లాడుతూ మహాత్మ శ్రీ బసవేశ్వర 892 వ జయంతి శుభాకాంక్షలు తెలియచేసారు. హోప్ ఫౌండేషన్ చైర్మన్ కొండా విజయ్ ఆధ్వర్యంలో ఘనంగా బసవేశ్వరుడి జయంతి వేడుకలు నిర్వహించుకోవడం గొప్ప విషయం అని , బసవేశ్వరుడి జయంతి సందర్భంగా పేద మహిళలకు చీరలను అందచేయడం చాలా గొప్ప విషయం అని కొండా విజయ్ సామాజిక సేవలను PAC చైర్మన్ గాంధీ కొనియాడారు.
ఈ కార్యక్రమంలో నాయకులు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, మల్లికార్జున్ శర్మ ,నరేందర్ బల్లా, పుట్ట వినయ కుమార్ గౌడ్, మహిళలు తదితరులు పాల్గొన్నారు.