అభివృద్ధి పనులను వేగవంతం చేయాలి – మియాపూర్ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్

నమస్తే శేరిలింగంపల్లి: మియాపూర్ డివిజన్ లో చేపట్టిన అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ అధికారులకు సూచించారు. మియాపూర్ డివిజన్ పరిధిలోని పలు కాలనీలలో చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై జీహెచ్ఎంసీ అధికారులతో కలసి స్థానిక కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ శ్రీకాంత్ మాట్లాడుతూ డివిజన్ లో చేపట్టిన అభివృద్ధి పనులను వేగవంతం చేయాలన్నారు. పెండింగ్ లో ఉన్న పనులను, కొత్తగా చేపట్టబోయే పనులపై చర్చించారు. డివిజన్ లో జరుగుతున్న అభివృద్ధి పనుల్లో గుత్తేదారులు నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తీసుకోవాలన్నారు. పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా కాలనీలలో కాలనీ వాసులు తమ దృష్టికి తీసుకొచ్చిన సమస్యలను వెంటనే పరిష్కరించాలని అధికారులను కోరారు. ఈ కార్యక్రమంలో ఏఈ శివ ప్రసాద్, వర్క్ ఇన్‌స్పెక్టర్ జగదీష్, నవీన్, తదితరులు పాల్గొన్నారు.

ఇంజనీరింగ్ విభాగం అధికారులతో మాట్లాడుతున్న మియాపూర్ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here