టీఆర్ఎస్‌తోనే తెలంగాణ అభివృద్ధి: రాగం నాగేంద‌ర్ యాద‌వ్

శేరిలింగంప‌ల్లి‌ (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): టిఆర్ఎస్ పార్టీతోనే తెలంగాణ అభివృద్ధి జ‌రుగుతుంద‌ని శేరిలింగంపల్లి డివిజన్ టిఆర్ఎస్ కార్పొరేటర్ అభ్యర్థి రాగం నాగేందర్ యాదవ్ అన్నారు. డివిజన్ పరిధిలోని పాపిరెడ్డి నగర్ లో ఆదివారం ఆయ‌న‌ ప్రచారంలో చురుకుగా పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా కాంగ్రెస్, బిజెపిలకు చెందిన యువత 200 మంది పాపిరెడ్డి నగర్ కాలనీలో టిఆర్ఎస్ పార్టీలో చేరారు. అనంతరం రాగం నాగేంద‌ర్ యాద‌వ్ మాట్లాడుతూ గత ఎన్నికల్లో పోటీచేసిన తర్వాత కాలనీలో రోడ్లు, డ్రైనేజ్, విద్యుత్ స్తంభాలు, పాఠశాల సముదాయం వంటి అనేక అభివృద్ధి పనులను పూర్తి చేశామ‌ని, అందుకు ఎంతో గ‌ర్వంగా ఉంద‌ని అన్నారు. యువత అంతా తన వెంట రావడం సంతోషంగా ఉందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో సాయి నందన్, వెంకట్, హరీష్, సమీర్, గోవర్ధన్, సురేష్, వెంకటగిరి, ప్రవీణ్ కుమార్, దినేష్, కృష్ణ, మల్లేష్, జాగీరు, అంజయ్య, ఆంజనేయులు, రఘుపతి, ప్రవీణ్ రెడ్డి, సాయి ముదిరాజ్ పాల్గొన్నారు.

పార్టీలో చేరిన యువ‌త‌తో రాగం నాగేంద‌ర్ యాద‌వ్
పాపిరెడ్డి నగర్ లో ముమ్మ‌రంగా ప్ర‌చారం చేస్తున్న రాగం నాగేంద‌ర్ యాద‌వ్
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here