సీఎం కేసీఆర్ చిత్ర‌ప‌టానికి మియాపూర్ ఆర్టీసీ కార్మికుల పాలాభిషేకం

మియాపూర్‌ (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): ఆర్‌టీసీలో స‌మ్మె కాలానికి గాను ఉద్యోగులు, కార్మికుల‌కు వేత‌నాల‌ను చెల్లించినందుకు కృత‌జ్ఞ‌త‌లు తెలుపుతూ మియాపూర్ ఆర్‌టీసీ డిపో 1, 2 సిబ్బంది ఆదివారం సీఎం కేసీఆర్ చిత్ర‌ప‌టానికి పాలాభిషేకం చేశారు. ఆర్టీసీలో సమ్మె చేసిన 12 రోజుల‌కు వేత‌నాల‌ను చెల్లించ‌డంపై వారు హ‌ర్షం వ్య‌క్తం చేశారు. మియాపూర్‌లోని ఆర్టీసీ డిపో 1, 2 ల‌కు చెందిన మేనేజ‌ర్లు వెంక‌టేశం, మ‌ధుసూద‌న్‌లు ఉద్యోగులు, కార్మికుల‌తో క‌లిసి సీఎం కేసీఆర్ చిత్ర‌ప‌టానికి పాలాభిషేకం చేసి ధ‌న్య‌వాదాలు తెలిపారు. ఈ కార్య‌క్ర‌మంలో రెండు డిపోల‌కు చెందిన ఉద్యోగులు, కార్మికులు, సెక్యూరిటీ, గ్యారేజ్ సిబ్బంది పాల్గొన్నారు.

మియాపూర్ ఆర్టీసీ డిపో 1లో కార్మికుల‌ను ఉద్దేశించి మాట్లాడుతున్న మేనేజర్ వెంక‌టేశం
సీఎం కేసీఆర్ చిత్ర‌ప‌టానికి పాలాభిషేకం చేస్తున్న మియాపూర్ ఆర్టీసీ డిపో 1 మేనేజర్ వెంక‌టేశం
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here