వినాయక్ నగర్ లో డెంటల్‌ క్లీనిక్ ను ప్రారంభించిన సాయిబాబా

నమస్తే శేరిలింగంపల్లి: అందరికి అందుబాటులో ఉండేలా గచ్చిబౌలి ప్రాంతంలో డెంటల్ క్లీనిక్ ను ఏర్పాటు చేసుకోవడం అభినందనీయమని గచ్చిబౌలి డివిజన్ మాజీ కార్పొరేటర్ కొమిరిశెట్టి సాయిబాబా అన్నారు. గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని వినాయక్ నగర్ లో నూతనంగా ఏర్పాటు చేసిన టూత్ వే డెంటల్ క్లినిక్ ను గచ్చిబౌలి డివిజన్ మాజీ కార్పొరేటర్ కొమిరిశెట్టి సాయిబాబా ప్రారంభించారు. దంతాలకు సంబంధించిన అన్ని రకాల చికిత్సలు ఈ క్లినిక్ లో చేయడం జరుగుతుందన్నారు. మెరుగైన సేవలందించి అందరి మన్ననలు పొందాలని సాయిబాబా సూచించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ ఎం.శంతన్ రెడ్డి, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు కూన సత్యం గౌడ్, సాయి తేజ గౌడ్, దశరథ్ రావు డెంటల్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

డెంటల్ క్లీనిక్ ను ప్రారంభిస్తున్న గచ్చిబౌలి మాజీ కార్పొరేటర్ సాయిబాబా
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here