ల‌గ‌చ‌ర్ల రైతుల‌ను వెంట‌నే విడుద‌ల చేయాల‌ని డిమాండ్

శేరిలింగంప‌ల్లి, డిసెంబ‌ర్ 17 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): లగచర్ల రైతులపై అక్రమంగా కేసులు పెట్టి, వారిపైన థర్డ్ డిగ్రీ ప్రయోగించి జైళ్లలో నిర్బంధించి, రైతుల చేతులకు బేడీలు వేసిన కాంగ్రెస్ ప్రభుత్వ నిరంకుశ,అమానవీయ, అణిచివేత విధానాలకు నిరసనగా రైతన్నలపై నమోదు చేసిన అక్రమ కేసులను ఎత్తివేసి, వారిని వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం సమర్పించారు. ఈకార్యక్రమంలో division president BSN కిరణ్ యాదవ్, గోపరాజు శ్రీనివాసరావు, నర్సింగ్, హనీఫ్, శ్రీనివాస్, రవి,TRSV బండ్ల రాజు, కలిదిండి కృష్ణంరాజు ముజీఫ్, సమీర్ తదితరులు పాల్గొన్నారు.

డాక్ట‌ర్ బీఆర్ అంద‌బేద్క‌ర్ విగ్ర‌హానికి విన‌తిప‌త్రం స‌మ‌ర్ప‌లిస్తున్న బీఆర్ఎస్ నాయ‌కులు
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here