‘దళిత బంధు’ దేశానికే ఆదర్శం

  • లబ్ధిదారులకు  మంజూరైన  R.K. INDUSTRIES షాప్ ను ప్రారంభించిన కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ 

నమస్తే శేరిలింగంపల్లి:  తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన దళిత బంధు పథకంలో భాగంగా రాజీవ్ గృహకల్ప కాలనీ నివాసితులైన పినపాక రజిని కుటుంబ సభ్యులకు దళిత బంధు ద్వారా మంజూరైన యూనిట్ ను రాజీవ్ గృహకల్పలో నూతనంగా ఏర్పాటు చేసిన ఆర్ కె ఇండస్ట్రీస్ సీలింగ్ క్లాత్ హ్యాంగర్స్, మస్కిటో నెట్టింగ్ సొల్యూషన్ షాపును స్థానిక వాసులతో కలిసి కార్పొరేటర్ గౌరవ రాగం నాగేందర్ యాదవ్ పూజలు చేసి ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ వినియోగదారులకు మంచి సేవలు అందిస్తూ, వారి మన్ననలు పొందాలని తెలిపారు. ముఖ్యమంత్రి కెసిఆర్ నాయకత్వంలో టిఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న దళిత బంధు పథకం దేశానికి ఆదర్శంగా నిలుస్తుందన్నారు. ఈ సందర్భంగా లబ్ధిదారులు ముఖ్యమంత్రి కెసిఆర్, మంత్రి కేటీఆర్, ప్రభుత్వ విప్ అరేకపూడి గాంధీ, కార్పొరేటర్ నాగేందర్ యాదవ్ కు  ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాజీవ్ గృహకల్ప వార్డు మెంబర్ శ్రీకళ, సందయ్యనగర్ కాలనీ ప్రెసిడెంట్ బసవరాజు లింగాయత్, కొయ్యడ లక్ష్మణ్ యాదవ్, గోపాల్ యాదవ్, పట్లోళ్ల నరసింహారెడ్డి, చారి, కుమారి, నజియా, సబీనాకుమారి, సుధారాణి, కళ్యాణి, రామ్ చందర్, శ్రీను దళిత బంధు లబ్ధిదారులు పినపాక రజిని కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

దళిత బంధు ద్వారా మంజూరైన   R.K. INDUSTRIES షాప్ ను ప్రారంభించిన కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here