కొండాపూర్ సైబ‌ర్‌హిల్స్ నాలా విస్త‌ర‌ణ ప‌నుల‌ను ప‌రిశీలించిన ప్ర‌భుత్వ విప్ గాంధీ

న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి: కొండాపూర్ డివిజన్ పరిధిలోని సైబర్‌హిల్స్ నుంచి జ‌నార్ధ‌న్ హిల్స్ వ‌ర‌కు చేప‌డుతున్న‌ నాల విస్తరణ ప‌నుల‌ను జీహెచ్ఎంసీ అధికారుల‌తో క‌ల‌సి ప్రభుత్వ విప్ ఆరేకపూడి గాంధీ ఆదివారం పరిశీలించారు. ఈ సందర్బంగా గాంధీ మాట్లాడుతూ కరోనా వంటి విపతర్క పరిస్ధితుల్లో అభివృద్ధి, సంక్షేమం అగకూడదనే ఉదేశ్యంతో ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని అన్నారు. అభివృద్ధి విషయంలో ఎక్కడ రాజీ పడకుండా పనులు త్వరితగతిన పూర్తి అయ్యేలా చూడాల‌ని, మిగిలిపోయిన నాలా విస్తరణ పనులలో వేగం పెంచాలని అధికారుల‌ను సూచించారు. ప్రాజెక్ట్స్‌, జీహెచ్ఎంసీ అధికారులు సమన్వయంతో పని చేసి పనులలో పురోగతి సాధించాలని అన్నారు. అదేవిధంగా నాలా విస్తరణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని, పనులు నాణ్యత ప్రమాణాలతో చేపట్టాలని అన్నారు. ఎటువంటి ఇబ్బంది కలగకుండా ప‌నుల‌ను త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వ విప్ గాంధీ పేర్కొన్నారు. ఈ కార్య‌క్ర‌మంలో అధికారులు డీఈ రమేష్, ఏఈ ప్రతాప్ త‌దితరులు పాల్గొన్నారు.

నాలా విస్త‌ర‌ణ ప‌నుల‌ను ప‌రిశీలిస్తున్న ప్ర‌భుత్వ విప్ గాంధీ, డీఈ ర‌మేష్‌, ఏఈ ప్ర‌తాప్‌లతో మాట్లాడుతున్న కాల‌నీవాసులు
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here