హ‌రిజ‌న బ‌స్తీ, న‌వ‌భార‌త్ న‌గ‌ర్ బ‌స్తీల‌లో కార్పొరేట‌ర్ వి.జగదీశ్వర్ గౌడ్ ప‌ర్య‌ట‌న

మాదాపూర్ (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): మాదాపూర్ డివిజన్ అభివృద్ధే ప్రధాన లక్ష్యంగా ముందుకు సాగుతున్నామ‌ని కార్పొరేట‌ర్ వి.జగదీశ్వర్ గౌడ్ అన్నారు. శ‌నివారం ఆయ‌న డివిజ‌న్ ప‌రిధిలోని హ‌రిజ‌న బ‌స్తీలో ప‌ర్య‌టించారు. స్థానిక ప్ర‌జ‌ల‌ను అడిగి స‌మ‌స్య‌ల‌ను తెలుసుకున్నారు. అలాగే బ‌స్తీలో నూత‌నంగా చేప‌ట్టిన సీసీ రోడ్డు, యూజీడీ ప‌నుల‌ను ప‌రిశీలించారు. మంజీరా పైప్‌లైన్ లీకేజీ, విద్యుత్ స్తంభాల తొల‌గింపు, నూత‌న స్తంభాల ఏర్పాటు వంటి స‌మ‌స్య‌ల‌ను స్థానికులు కార్పొరేట‌ర్ దృష్టికి తీసుకువ‌చ్చారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ పెండింగ్‌లో ఉన్న ప‌నుల‌ను త్వ‌ర‌గా పూర్తి చేస్తామ‌ని, బ‌స్తీలో ఉన్న స‌మ‌స్య‌ల‌ను త్వ‌ర‌గా ప‌రిష్క‌రిస్తామ‌ని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు సహదేవ్, రాజు, కిట్టు, ప్రభు, సుధాకర్, మహేందర్, నరేష్ పాల్గొన్నారు.

హ‌రిజ‌న బ‌స్తీలో ప‌ర్య‌టిస్తున్న కార్పొరేట‌ర్ వి.జగదీశ్వర్ గౌడ్
హ‌రిజ‌న బ‌స్తీలో స్థానికుల స‌మ‌స్య‌ల‌ను అడిగి తెలుసుకుంటున్న కార్పొరేట‌ర్ వి.జగదీశ్వర్ గౌడ్

న‌వ‌భార‌త్ న‌గ‌ర్‌లో…
మాదాపూర్ డివిజన్ పరిధిలోని నవభారత్ నగర్ బస్తీలో కార్పొరేట‌ర్ వి.జగదీశ్వర్ గౌడ్ ఇంటింటికీ పాదయాత్ర నిర్వహించారు. ఈ సంద‌ర్భంగా కార్పొరేట‌ర్ ను స్థానికులు స‌న్మానించారు. వారికి ఆయ‌న ధ‌న్య‌వాదాలు తెలిపారు. బ‌స్తీలో అందుబాటులోకి వ‌చ్చిన సీసీ రోడ్డును ఆయ‌న ప‌రిశీలించారు. నూత‌నంగా చేప‌ట్టాల్సిన యూజీడీ, విద్యుత్ స్తంభాల ఏర్పాటు, రోడ్ల విస్త‌ర‌ణ ప‌నుల‌ను స్థానికులు కార్పొరేట‌ర్ దృష్టికి తీసుకురాగా స‌త్వ‌ర‌మే ప‌నుల‌ను ప్రారంభించి పూర్తి చేస్తామ‌ని ఆయ‌న హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సాదిక్, నూరుద్దీన్, అలీ, శ్రీనివాస్ గౌడ్, వెంకటేష్, అంజాద్, అఫీజ్, అమీర్, తమిమ్, సిరాజ్, షఫీ, త‌న్వీర్, రకిబ్, కరణ్, ఉమ‌ర్, మూర్తి, అనిల్, షాహిన్ తాజ్, రెహన బేగం, సావిత్రి, మీనా, రాములమ్మ, గౌసియా బేగం, ఆండాలమ్మ పాల్గొన్నారు.

నవభారత్ నగర్ బస్తీలో ప‌ర్య‌టిస్తున్న కార్పొరేట‌ర్ వి.జగదీశ్వర్ గౌడ్
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here