శేరిలింగంపల్లి, అక్టోబర్ 14 (నమస్తే శేరిలింగంపల్లి): హైదర్ నగర్ డివిజన్ గౌరవ కార్పొరేటర్ నార్నె శ్రీనివాసరావు జన్మదినం సందర్భంగా ఆయన కార్యాలయంలో ఆయనను మియాపూర్ డివిజన్ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ మర్యాదపూర్వకంగా కలసి శాలువాతో సత్కరించి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వెస్ట్ జోన్ బిల్డర్స్ అసోసియేషన్ జనరల్ సెక్రెటరీ కొంక ప్రసాద్ రావు, పేర్లి ఏబు, స్థానిక నాయకులు కావూరి అనిల్, అవినాష్, జాస్తి తదితరులు పాల్గొన్నారు.






