ఇఫ్తార్ విందులో పాల్గొన్న కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్

శేరిలింగంప‌ల్లి, మార్చి 27 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): రంజాన్ మాసంను పురస్కరించుకుని సాయి జ్యోతి నగర్ కాలనీ మైనార్టీ నాయకుల ఆధ్వర్యంలో నిర్వహించిన దవాత్- ఏ- ఇఫ్తార్ విందు కార్యక్రమంలో మియాపూర్ డివిజన్ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ స్థానిక నాయకులతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ శ్రీకాంత్ మాట్లాడుతూ రంజాన్ పర్వదినం ను పురస్కరించుకుని ముస్లింల‌కు ఇప్తార్ విందు ఇవ్వడం చాలా అభినదించదగ్గ విషయం అని అన్నారు. రంజాన్ పండుగ ప్రజాల జీవితాల్లో సుఖ సంతోషాలను అందించాలని రంజాన్ మాసం ఉపవాసంతో మంచితనం, సంస్కారం అలవడుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మైనార్టీ నాయకులు మహమ్మద్ ఖాజా, యాసీన్ అహ్మద్, అబ్దుల్ హసీబ్ , హఫీస్ పాషా, రజాక్ భాయ్, హఫీస్ భాయ్, స్థానిక నాయకులు మాధవరం గోపాల్ రావు, ప్రతాప్ రెడ్డి, అమరేందర్ రెడ్డి, దామోదర్ రెడ్డి, శివయ్య, శ్రీకాంత్, శివ, అవినాష్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here