శేరిలింగంపల్లి, ఫిబ్రవరి 16 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి నియోజకవర్గం అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్నామని కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి వి.జగదీశ్వర్ గౌడ్ అన్నారు. హాఫీజ్ పేట్ డివిజన్ పరిధిలోని వైశాలి నగర్ లో నిర్మిస్తున్న నాలా పనులను, ఈర్ల చెరువును పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేడు మనం చేసే పనులు రాబోయే తరాలకు మేలు జరిగేలా ఉండాలని అన్నారు. తన దృష్టికి వచ్చే ప్రతి అంశాన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లి ప్రజలకు మంచి జరిగేలా చూస్తానని తెలిపారు. గెలుపోటములకు అతీతంగా ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి తన వంతు ప్రయత్నం ఉంటుందని మరో సారి స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో కృష్ణ ముదిరాజ్, బంగారు బాబు, ప్రసాద్ రెడ్డి, విఘ్నేశ్వర్ రెడ్డి, కృష్ణ కుమార్, మూర్తి, కన్నారావు, హరిప్రసాద్, కిషోర్, వినయ్, కుమార్, రాహుల్ తదితరులు పాల్గొన్నారు.