జగదీశ్వర్ గౌడ్ కి కాంగ్రెస్ నాయ‌కుల శుభాకాంక్ష‌లు

శేరిలింగంపల్లి, ఫిబ్ర‌వ‌రి 24 (న‌మ‌స్తే శేరిలింగంపల్లి): గ్రేటర్ హైదరాబాద్ స్టాండింగ్ కమిటీ సభ్యుడిగా ఎన్నికైన శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్, మాదాపూర్ డివిజన్ కార్పొరేటర్ వి.జగదీశ్వర్ గౌడ్ కి శేరిలింగంపల్లి కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ కూన సత్యం గౌడ్, వర్కింగ్ ప్రెసిడెంట్ శిరీష సత్తూర్, 124 డివిజన్ కాంగ్రెస్ నాయకులు అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా శిరీష సత్తూర్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ 10 సంవత్సరాల తర్వాత గ్రేటర్ హైదరాబాద్ స్టాండింగ్ కమిటీకిగాను జగదీశ్వర్ గౌడ్ ని ఏకగ్రీవంగా ఎన్నిక చేయడం చాలా సంతోషంగా ఉందని, శేరిలింగంపల్లి నియోజకవర్గ అభివృద్ధికి జగదీశ్వ‌ర్ గౌడ్ చేసే కృషికి ఎల్లప్పుడూ మహిళలు తోడుంటార‌ని ఆమె పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో యశ్వంత్, మధు, అనురాధ, గాయత్రి, మణమ్మ, లీల తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here