పేదలకు చేయూతనందిస్తున్న సీఎంఆర్ఎఫ్ – ప్రభుత్వ విప్‌ గాంధీ

నమస్తే శేరిలింగంపల్లి: ముఖ్యమంత్రి సహాయ నిధి ఎంతో మంది పేదలకు ఆర్థికంగా ఆసరా అవుతోందని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ అన్నారు.శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలోని పలువురు అత్యవసర చికిత్స నిమిత్తం ఆర్థిక సహాయ కోసం ముఖ్య మంత్రి సహాయ నిధికి దరఖాస్తు చేసుకోగా మంజూరైన రూ.3.88 లక్షల సీఎంఆర్ఎఫ్ ఎల్ ఓ సీ పత్రాలను ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజాక్షేమమే ప్రభుత్వ లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. సీఎం సహాయ నిధి నిరంతరం సేవలందిస్తూ ఆపదలో ఉన్న వారికి ఆపన్న హస్తంలా మారిందన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ మాధవరం రంగారావు, టీఆర్ఎస్ నాయకులు తిరుపతి, మధు, శ్రీనివాస్ చౌదరీ, చంద్రమోహన్ సాగర్, అంజిరెడ్డి, లక్ష్మీ, తదితరులు పాల్గొన్నారు.

సీఎంఆర్ఎఫ్ ఎల్ ఓ సీ అందజేస్తున్న ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here