సీఎంఆర్ఎఫ్ తో పేదలకు చేయూత – ప్రభుత్వ విప్‌ ఆరెకపూడి గాంధీ

నమస్తే శేరిలింగంపల్లి: ముఖ్యమంత్రి సహాయ నిధి పేదలకు భరోసా ఇచ్చి ఆర్థికంగా ఆదుకుంటుందని ప్రభుత్వ‌‌ విప్,‌ ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ అన్నారు. శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలోని పలువురు అత్యవసర వైద్య చికిత్స నిమిత్తం ముఖ్యమంత్రి సహాయ నిధికి దరఖాస్తు చేసుకోగా రూ. 3 లక్షల ఆర్ధిక సహాయానికి సంబంధించిన సీఎంఆర్ఎఫ్ ఎల్ ఓ‌ సీ మంజూరి పత్రాలను బాధిత కుటుంబాలకు ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ అందజేశారు. ప్రజా సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఎంతోమంది పేదలు ఆర్థిక సహాయం పొందుతున్నారని చెప్పారు. అనారోగ్యానికి గురై ఆర్థిక స్థోమత లేక ఆసుపత్రిలో చికిత్స పొందిన నిరుపేదలకు, అభాగ్యులకు అండగా సీఎం సహాయ నిధి ఆర్థిక భరోసా ఇస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు గుమ్మడి శ్రీనివాస్, రాంచందర్ తదితరులు పాల్గొన్నారు.

సీఎంఆర్ఎఫ్ ‌ఎల్ ఓ సీ పత్రాలను అందజేస్తున్న ప్రభుత్వ విప్ గాంధీ
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here