సీఎంఆర్ఎఫ్ పేదలకు భరోసా – ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ

నమస్తే శేరిలింగంపల్లి: ముఖ్యమంత్రి సహాయ నిధి ఎంతో మంది పేదలకు ఆసరాగా నిలుస్తోందని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ అన్నారు. శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని నెహ్రూ నగర్ కు చెందిన జె. సురేష్ అత్యవసర చికిత్స నిమిత్తం ముఖ్య మంత్రి సహాయ నిధికి దరఖాస్తు చేసుకోగా సీఎంఆర్ఎఫ్ ద్వారా మంజూరైన లక్ష రూపాయల ఆర్థిక సహాయానికి సంబంధించిన ఎల్ ఓ సీ మంజూరు పత్రాన్ని బాధిత కుటుంబానికి ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ అందజేశారు. ప్రజాక్షేమమే ప్రభుత్వ లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు. ముఖ్యమంత్రి సహాయ నిధి నిరంతరం సేవలను అందిస్తూ ఆపదలో ఉన్న వారికి ఆపన్న హస్తంలా ఆదుకుంటుందని చెప్పారు.ఈ కార్యక్రమంలో మాదాపూర్ డివిజన్ అధ్యక్షుడు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, టీఆర్ఎస్ నాయకులు ఊట్ల కృష్ణ, నాయి నేని చంద్రకాంత్ రావు, గుమ్మడి శ్రీనివాస్, మోజేష్, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.

సీఎంఆర్ఎఫ్ ఎల్ ఓ సీ మంజూరు పత్రాన్ని అందజేస్తున్న ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here