సాయినాథుని ఆలయంలో ఉరిటి వెంకట్ రావు అన్నదానం

నమస్తే శేరిలింగంపల్లి: చందానగర్ హుడా కాలనీ ఫేజ్ 2 లోని శ్రీ షిరిడి సాయిబాబా దేవాలయంలో గురుపౌర్ణమి వేడుకలు ఘనంగా‌ జరిగాయి. ఉదయం సాయినాథునికి పంచామృతాభిషేకాలతో పాటు సహస్త్రనామ అర్చనలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. హుడా కాలనీ తో పాటు చుట్టు పక్కల ప్రాంతాలకు చెందిన భక్తులు అధిక సంఖ్యలో హాజరై సాయినాథున్ని దర్శించుకున్నారు. మధ్యాహ్నం టీఆర్ఎస్ సీనియర్ నాయకులు ఉరిటి వెంకటరావు కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో భక్తులకు అన్నదానం కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఉరిటి వెంకట్ రావు మాట్లాడుతూ ఆలయం నిర్మాణం చేపట్టిన మొదటి సంవత్సరం నుంచి ప్రతి ఏటా గురుపౌర్ణమి రోజున అన్నదాన కార్యక్రమాన్ని తమ ఆధ్వర్యంలో నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు. సాయినాథుని ఆశీస్సులు అందరిపై ఉండాలని ఆకాంక్షించారు.  కార్యక్రమంలో షిర్డీ సాయిబాబా సేవా సమితి అధ్యక్షుడు కె. శ్రీనివాస్ రావు, ఉపాధ్యక్షుడు రాజయ్య, జనరల్ సెక్రటరీ నారాయణ, జాయింట్ సెక్రటరీ శ్రీనివాస నాయక్, కోశాధికారి కిశోర్ బాబు, ఎగ్జిక్యూటివ్ మెంబర్లు హన్మంత్ రావు, రాంరెడ్డి, త్రినాథ నాయుడు, సిద్ది రాములు తదితరులు ఉన్నారు.

హుడా కాలనీ ఫేజ్ 2 లోని సాయిబాబా ఆలయంలో కుటుంబ సమేతంగా ప్రత్యేక పూజలు చేసిన టీఆర్ఎస్ నాయకులు ఉరిటి వెంకట్ రావు

 

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here