గజ్జల యోగానంద్ సహకారంతో ఇంటింటికి మట్టి వినాయక ప్రతిమల పంపిణీ

నమస్తే శేరిలింగంపల్లి: బిజెపి శేరిలింగంపల్లి నియోజకవర్గ ఇంచార్జి గజ్జల యోగానంద్ సహకారంతో వివేకానంద నగర్ డివిజన్ లో మంగళవారం మట్టి వినాయకులను వివేకానంద నగర్ డివిజన్ కంటెస్టెంట్ కార్పొరేటర్, జిల్లా మహిళా మోర్చా సెక్రెటరీ విద్యా కల్పన ఏకాంత్ గౌడ్ పంపిణీ చేశారు. డివిజన్ లోని రిక్షా పుల్లర్ కాలనీ లో ఇంటింటికి తిరిగి మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చేస్తూ పర్యావరణం పై ప్రజలకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఓబీసీ మోర్చా జిల్లా ఉపాధ్యక్షుడు శ్రీహరి యాదవ్, జిల్లా ఎస్సీ మోర్చా సెక్రెటరీ అశోక్, డివిజన్ ఉపాధ్యక్షుడు గణేష్ గౌడ్, సీనియర్ నాయకులు భీమయ్య గౌడ్, డివిజన్ ఎస్సీ మోర్చా అధ్యక్షుడు రమేష్, డివిజన్ ఎస్ సి మోర్చా ప్రధాన కార్యదర్శి ఉపేందర్, ఎస్సీ మోర్చా ఉపాధ్యక్షుడు యాకయ్య, ఓబీసీ మోర్చా ప్రధాన కార్యదర్శి రాజు గౌడ్, డివిజన్ మహిళా మోర్చా ప్రధాన కార్యదర్శి మమత, మహిళా మోర్చా సెక్రటరీ ఉపేంద్ర, మహిళా మోర్చా ఉపాధ్యక్షురాలు శృతి, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here