బెజవాడ కనక దుర్గమ్మను దర్శించుకున్న చిర్రా రవీందర్ యాదవ్

శేరిలింగంప‌ల్లి, జ‌న‌వ‌రి 17 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విజయవాడలోని ఇంద్రకీలాద్రి కనుక దుర్గమ్మ అమ్మవారిని భారాస రాష్ట్ర నాయకుడు, శేరిలింగంపల్లి యువ నేత చిర్రా రవీందర్ యాదవ్ దర్శించుకున్నారు. ఇంద్రకీలాద్రి దుర్గమ్మకు ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అధికారులు ఈ సందర్భంగా రవీందర్ యాదవ్ కు అమ్మవారి ప్రసాదాలను అందజేశారు. రానున్న జీహెచ్ఎంసీ ఎన్నికల్లో భారాస ఘన విజయం సాధించాలని బెజవాడ కనుక దుర్గమ్మను మొక్కుకున్నట్లుగా చిర్రా రవీందర్ యాదవ్ వెల్లడించారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నాయకత్వంలో అత్యధిక స్థానాలను గెలుచుకుంటామ‌ని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పాలనలో రాష్ట్రంలో అభివృద్ధి ఆగిపోయిందన్నారు. కాంగ్రెస్ నేతలకు రాష్ట్రాన్ని దోచుకోవడంలో ఉన్న ఆసక్తి అభివృద్ధి చేయడంలో లేదన్నారు.

సీఎంగా కేసీఆర్ పాలనలో తెలంగాణ అన్నింట్లో అగ్రపథంలో నిలిచిందని గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్రాన్ని తేవడమే కాకుండా అభివృద్ధి చేసి చూపించిన ఘనత కేసీఆర్ కే దక్కిందని కొనియాడారు. మున్సిపల్, ఐటీ శాఖల మంత్రిగా కేటీఆర్ హైదరాబాద్ ను అంతర్జాతీయ నగరాల సరసన నిలబెట్టారన్నారు. దాన్ని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ కాపాడటంలో విఫలం అయ్యిందన్నారు. హైదరాబాద్ ను విశ్వనగరంగా కేటీఆర్ మార్చార‌న్నారు. సీఎం రేవంత్ పాలనలో కనీసం ఒక్క ఫ్లైఓవర్ కట్టిన పాపన పోలేదన్నారు. హైదరాబాద్ ఖ్యాతిని దిగజార్చారు అని కాంగ్రెస్ సర్కార్ పై చిర్రా రవీందర్ యాదవ్ విమర్శలు చేశారు. గ్రేటర్ లో బీఆర్ఎస్ పార్టీకి తిరుగులేద‌న్నారు. శేరిలింగంపల్లిలోని అన్ని డివిజన్ లను గెలిపించుకుంటామని చిర్రా రవీందర్ యాదవ్ స్పష్టం చేశారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here