శేరిలింగంపల్లి, మే 9 (నమస్తే శేరిలింగంపల్లి): ఆపదలో ఉన్న బాధితులకు ముఖ్యమంత్రి సహాయ నిధి ఆపన్న హస్తం అందిస్తుందని శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి వి.జగదీశ్వర్ గౌడ్ అన్నారు. శేరిలింగంపల్లి నియోజకవర్గం అల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని పిజేఆర్ నగర్ నివాసి అనారోగ్యం కారణంగా హాస్పిటల్ లో చికిత్స పొందిన అనంతరం శేరిలింగపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కార్యాలయాన్ని సంప్రదించగా ముఖ్యమంత్రి సహాయ నిధికి దరఖాస్తు చేయించారు. ఈ సందర్భంగా బాధితుడికి మంజూరు అయిన రూ.60,000 ల చెక్కును నియోజకవర్గ నాయకులతో కలిసి బాధితులకి జగదీశ్వర్ గౌడ్ అందచేశారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గం కోఆర్డినేటర్ రఘునందన్ రెడ్డి, నాయకులు పట్వారీ శశిధర్, సంగమేష్, ముజీబ్, సుధాకర్, రత్నం, కిరణ్, కుమార్ తదితరులు పాల్గొన్నారు.