శేరిలింగంపల్లి, మే 9 (నమస్తే శేరిలింగంపల్లి): తెలంగాణ మలి దశ ఉద్యమ కారుడు, బీఆర్ఎస్ పార్టీ మాజీ శేరిలింగంపల్లి ఇన్చార్జి కొండకల్ శంకర్ గౌడ్ 56వ జయంతి సందర్బంగా శేరిలింగంపల్లి నియోజకవర్గం గచ్చిబౌలి డివిజన్ బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో శంకర్ గౌడ్ చిత్రపటానికి ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో చెన్నం రాజు, అంజమ్మ, దారుగుపల్లి నరేష్, పెద్దగోని రమేష్ గౌడ్, ఆకుల యాదగిరి, బురాన్, బాలమణి, మాధవి, సుగుణ తదితరులు పాల్గొన్నారు.