బంగారు తెలంగాణ‌‌ కోసం కేసీఆర్ మరో ఉద్యమం: చందానగర్ కార్పొరేటర్ మంజులరఘునాథ్ రెడ్డి

నమస్తే శేరిలింగంపల్లి: ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ముఖ్యమంత్రి కేసిఆర్ అహర్నిశలు కృషి చేశారని, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత బంగారు తెలంగాణగా తీర్చిదిద్దేందుకు మరో ఉద్యమం చేస్తున్నారని చందానగర్ డివిజన్ కార్పొరేటర్ మంజులరఘునాథ్ రెడ్డి తెలిపారు. చందానగర్ డివిజన్ పరిధిలో టీఆర్ఎస్ పార్టీ 21వ ఆవిర్భావ దినోత్సవం వేడుకలు ఘనంగా జరిగాయి. చందానగర్ డివిజన్ పరిధిలోని గాంధీ విగ్రహం, శంకర్ నగర్, భవానిపురం, వేమన కాలనీ, సురక్ష ఎన్ క్లేవ్, కైలాస్ నగర్, వేముకుంట, శిల్ప ఎన్ క్లేవ్, శ్రీరాం నగర్ తో పాటు తదితర కాలనీలలో టీఆర్ఎస్ పార్టీ 21వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా చందానగర్ డివిజన్ కార్పోరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డీ గులాబీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గత 60 ఏళ్ల జరగని అభివృద్ధి ఎనిమిది సంవత్సరాల్లో కేసీఆర్ చేసి చూపించారని చెప్పారు. రాష్ట్ర అభివృద్ధికి కేసీఆర్ నిరంతరం కృషి చేస్తుంటే విపక్ష పార్టీలు ఓర్వలేక టిఆర్ఎస్ పార్టీ పై అసత్య ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో చందానగర్ డివిజన్ టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు రఘునాథ్ రెడ్డి, అశోక్ గౌడ్, లక్ష్మీ నారాయణ గౌడ్, గురు చరణ్ దూబే, గోవర్ధన్ రెడ్డి, ధనలక్ష్మి, పులిపాటి నాగరాజు, వెంకటేష్, రవీందర్ రెడ్డి, సుప్రజ ప్రవీణ్, అక్బర్ ఖాన్, దాసు, శ్రీకాంత్, హరీష్, యేలమయ్య, కార్తిక్ గౌడ్, నరేందర్ భల్లా, యశ్వంత్, ఉదయ్, అమిత్ దూబే, ఖాదర్, కుమార్ తదితరులు పాల్గొన్నారు.

చందానగర్ డివిజన్ పరిధిలో టీఆర్ఎస్ జెండాను‌ ఆవిష్కరిస్తున్న కార్పొరేటర్ మంజులరఘునాథ్ రెడ్డి

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here