తెలంగాణ రాష్ట్రం చేపట్టిన కులగణన దేశానికే ఆదర్శం: జగదీశ్వర్ గౌడ్

శేరిలింగంప‌ల్లి, మే 2 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): కుల గణనపై కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని కాంగ్రెస్ పార్టీ స్వాగతిస్తుంద‌ని, తెలంగాణ రాష్ట్రం చేపట్టిన కులగణన దేశానికే ఆదర్శమ‌ని శేరిలింగంపల్లి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వి జగదీశ్వర్ గౌడ్ అన్నారు. ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో లో పెట్టిన విధంగా కాంగ్రెస్ అధికారంలోకి రాగానే కుల గణన సర్వే ద్వారా బడుగు బలహీన వర్గాలకు మేమెంతో మాకంతా అన్న విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కులగణన చేప‌ట్టి దేశానికి ఆదర్శంగా నిలిచిందని, రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో ఇచ్చిన హామీని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పూర్తి చేసిందని అన్నారు. కులగణనకి ఏకగ్రీవంగా ఆమోదం తెలిపినందుకు అందరికీ ధన్యవాదాలు తెలిపారు.

మాదాపూర్ డివిజన్ పరిధిలోని సుభాష్ చంద్రబోస్ నగర్ లో డివిజన్ అధ్య‌క్షుడు నగేష్ నాయక్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో శేరిలింగంపల్లి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ నాయకులు, సభ్యులతో కలిసి రాహుల్ గాంధీ, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రివర్గం ఆనాడు చేప‌ట్టిన‌ కులగణన వల్లే కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం దేశానికే ఆదర్శంగా నిలిచినందుకు మంత్రుల‌ చిత్రపటాల‌కి పాలాభిషేకం చేసి ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా జ‌గదీశ్వ‌ర్ గౌడ్‌ మాట్లాడుతూ కులగణన కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ పోరాటం అని, ఇది కాంగ్రెస్ పార్టీ విజయం అని అన్నారు. ఇప్పటికే కుల గణన నిర్వహించిన తెలంగాణ రాష్ట్రం నుండి సమాచారాన్ని సేకరించి, ఆ డేటాను ఉపయోగించి సమగ్ర చట్రాన్ని రూపొందించాలని రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి చెప్పిన మాటలను గుర్తుచేస్తూ కేంద్రాన్ని కోరారు.

ఈ కార్యక్రమంలో శేరిలింగంపల్లి కాంగ్రెస్ పార్టీ కోఆర్డినేటర్ రఘునందన్ రెడ్డి, మాదాపూర్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నగేష్ నాయక్, యూత్ కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు సౌందర్య రాజన్, నాయకులు రెహమాన్, హనీఫ్, ఇస్మాయిల్, ముక్తార్, ప్రేమ్, సాజిద్, లతీఫ్, ఖాజా, వెంకట్ రెడ్డి, చాంద్, రాంబాబు, ఆనంద్ సింగ్, శశిరేఖ, శ్రీజ రెడ్డి, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఉమాదేవి, మొగులమ్మ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here