బొటానికల్ గార్డెన్స్ లో స్వచ్ఛ్ సర్వేక్షన్

నమస్తే శేరిలింగంపల్లి: స్వచ్ఛ్ సర్వేక్షన్ కార్యక్రమంలో భాగంగా బొటానికల్ గార్డెన్స్‌లో వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆరోగ్యంపై అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. శేరిలింగంపల్లి సర్కిల్ 20 శానిటరీ సూపర్ వైజర్ జలందర్ రెడ్డి ఆరోగ్యం పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్త లపై అవగాహన కల్పించారు. కరోనా, ఒమిక్రాన్ పట్ల ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అందరూ వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని, ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించాలని పేర్కొన్నారు. సామాజిక దూరం పాటిస్తూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. అనంతరం బొటానికల్ గార్డెన్స్‌లో వాకర్స్‌తో కలిసి చెత్తాచెదారం తొలగించి స్వచ్ఛ్ భారత్ కార్యక్రమాన్ని నిర్వహించారు. వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు బాలకృష్ణ, రిటైర్డ్ డీఎస్పీ, రిటైర్డ్ ఎమ్మార్వోలు, ఎంపీడీఓలు, అధికారులు, రాజకీయ నాయకులు, ప్రజలు పాల్గొన్నారు.

బొటానికల్ గార్డెన్స్ లో చెత్తాచెదారం తొలగిస్తున్న శానిటేషన్ సిబ్బంది
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here