లలిత పోచమ్మ ను దర్శించుకున్న ఎమ్మెల్యే గాంధీ

నమస్తే శేరిలింగంపల్లి: తెలంగాణ రాష్ట్ర సంస్కృతి, సంప్రదాయాలకు బోనాల పర్వదిన మహోత్సవం ప్రతీకగా‌ నిలిచిందని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ అన్నారు. చందానగర్ డివిజన్ పరిధిలోని వేముకుంట గౌతమి నగర్ లో గల శ్రీ శ్రీ శ్రీ మహాశక్తి లలితా పోచమ్మ దేవస్థానంలో జరిగిన బోనాల ఉత్సవాలలో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమ్మ వారి దీవెనలతో ప్రజలంతా సుఖ సంతోషాలతో జీవించాలని అమ్మవారిని వేడుకున్నట్లు తెలిపారు. బోనాల సందర్భంగా ప్రతి గుడి వద్ద అన్ని రకాల మౌలిక వసతులు ఏర్పాటు చేశామన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ రవీందర్ రావు, చందానగర్ డివిజన్ అధ్యక్షుడు రఘునాథ్ రెడ్డి, మాదాపూర్ డివిజన్ అధ్యక్షుడు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, హోప్ ఫౌండేషన్ ఛైర్మెన్ కొండా విజయ్ కుమార్, నాయకులు అక్బర్ ఖాన్, నాగరాజు, గురుచరణ్ దూబే, మల్లేష్ గుప్తా, కార్తీక్ గౌడ్, నరేందర్ బల్లా, కాశినాథ్ యాదవ్, రాజేశేఖర్, కొండల్ రెడ్డి, దాస్, తదితరులు పాల్గొన్నారు.

అమ్మవారి ఆలయంలో హారతి తీసుకుంటున్న ప్రభుత్వ విప్ గాంధీ
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here