బొజ్జ గ‌ణ‌ప‌య్య ఆశీస్సులు అంద‌రికీ ఉండాలి: ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ

శేరిలింగంపల్లి, సెప్టెంబ‌ర్ 16 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): మియాపూర్ డివిజన్ పరిధిలోని మియాపూర్ విలేజ్ లో వినాయక చవితి ఉత్స‌వాల్లో భాగంగా వినాయక మండపం వద్ద నిర్వహించిన పూజ కార్యక్రమంలో కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ తో కలిసి ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం నిర్వ‌హించిన అన్నదానం కార్యక్రమంలో పాల్గొని భక్తులకు అన్నప్రసాదాలు వడ్డించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే గాంధీ మాట్లాడుతూ ఆ బొజ్జ గ‌ణ‌ప‌య్య ఆశీస్సులు అందరికీ ఉండాల‌ని కోరుకున్న‌ట్లు తెలిపారు.

గ‌ణ‌ప‌తికి పూజ‌లు చేసిన ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ

రాష్ట్రంలోనే శేరిలింగంప‌ల్లిని నంబ‌ర్ వ‌న్ నియోజ‌క‌వ‌ర్గంగా తీర్చిదిద్దుతామ‌ని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీ‌ధ‌ర్ బాబు చొర‌వ‌తో నియోజ‌క‌వ‌ర్గంలో అభివృద్ధి ప‌నుల‌ను శ‌ర‌వేగంగా చేప‌డుతున్నామ‌ని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్లు రాంచందర్ ముదిరాజు, లక్ష్మీ నారాయణ గౌడ్, మోహన్ ముదిరాజు, ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, జనార్దన్ రెడ్డి, వెంకటేష్ గౌడ్, నాగేశ్వర్ గౌడ్, కృష్ణ పటేల్, వీరేందర్ గౌడ్, ఓం ప్రకాష్ గౌడ్, భాస్కర్ గౌడ్, మహేందర్ ముదిరాజ్, సురేష్ ముదిరాజ్, రామచందర్ గౌడ్, శ్రీనివాస్ ముదిరాజ్, విజయ్ ముదిరాజ్, సాయి గౌడ్, రామచందర్, ప్రవీణ్ గౌడ్, వినయ్ ముదిరాజ్, రాజు, హన్మంతరావు, బాబూరావు, అశోక్, కొండయ్య, నరేందర్ పాల్గొన్నారు.

అన్న ప్ర‌సాదం కార్య‌క్ర‌మంలో పాల్గొన్న ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here