శేరిలింగంపల్లి, జనవరి 6 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి మాజీ ఎమ్మెల్యే భిక్షపతి యాదవ్కి కాంగ్రెస్ సీనియర్ నాయకుడు బోయిన్ పల్లి వినోద్ రావు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వినోద్ రావు మాట్లాడుతూ మదీనాగూడ శ్రీ అభయాంజనేయ స్వామి దీవెనలు ఎల్లప్పుడూ భిక్షపతియాదవ్కు ఉండాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. ఆలయ కమిటీ తరఫున ప్రత్యేకమైన శుభాకాంక్షలు తెలియజేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో యాదగిరి, సత్యనారాయణ, శ్రీనివాస్, ఆంజనేయులు, అంజి ముదిరాజ్ పాల్గొన్నారు.






